India Pakistan War: ప్రస్తుతం భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాలీవుడ్లో ఇప్పటికే పలు భారీ చిత్రాల రిలీజ్లు వాయిదా పడగా, ఇప్పుడు ఈ ప్రభావం టాలీవుడ్పైనా పడింది. మే నెలలో రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘కింగ్డమ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చనే ఆందోళనతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
అయితే, మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ మాత్రం మే 30న రిలీజ్కు సిద్ధమవుతోంది. మరోవైపు, మే నెలలో రావాల్సిన ఇతర చిత్రాల రిలీజ్లపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి, ఏవి వాయిదా పడతాయనేది సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యుద్ధ పరిస్థితులు త్వరగా సద్దుమణిగితేనే బాక్సాఫీస్ కళ తిరిగి కనిపిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. చూడాలి.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఏ మలుపు తిరుగుతుందో!