Nalgonda: నల్లగొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కారు లీడర్లు..

Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను తొలగించారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో బైఠాయించారు.

ఈ సంఘటనతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. పరస్పరం కుర్చీలు విసురుకునే వరకు పరిస్థితి ముదిరింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహా పలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *