Goods Train: అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో బుధవారం ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో ప్రమాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టాలపై వెళ్తున్న ఓ గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయాయి. ముడి ఇనుప ఖనిజం లోడుతో ఉన్న ఈ రైలు, కర్ణాటకలోని తోరణగల్లులో ఉన్న జిందాల్ పరిశ్రమకు వెళ్తుండగా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది.
2 కిలోమీటర్లు వెళ్లిన ఇంజిన్ మొత్తం 60 బోగీలతో వెళ్తున్న ఈ రైలులో, 6వ బోగీ వద్ద ఉన్న లింక్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వెనుక ఉన్న 54 బోగీలు అక్కడికక్కడే నిలిచిపోగా, ఇంజిన్ మాత్రం మిగిలిన ఆరు బోగీలతో సుమారు 2 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లిపోయింది. రైలు వేగంగా వెళ్తుండటంతో డ్రైవర్ మొదట దీనిని గమనించలేకపోయారు. ఆ తర్వాత వెనుక బోగీలు లేవని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఇంజిన్ను నిలిపివేశారు.
రెండు గంటల పాటు శ్రమించిన సిబ్బంది ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కష్టపడి, తెగిపోయిన లింక్ను సరిచేసి మళ్లీ బోగీలన్నింటినీ ఇంజిన్కు కలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పట్టాల మీద ఇతర రైళ్లు లేని సమయంలో ఇది జరగడంతో పెద్ద విఘాతం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
