Vijayasai Reddy

Vijayasai Reddy: మద్యం అక్రమాల కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ షాక్!

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి ఈడీ (ED) షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరుపుతున్న అధికారులు, ఈ నెల 22న తమ ముందు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసులలో స్పష్టం చేసింది.

ఈ కేసులో భారీ ఎత్తున హవాలా, మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. మద్యం సరఫరాలో నిబంధనల ఉల్లంఘన, నిధుల మళ్లింపు వంటి అంశాలపై విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన ఈడీ, తాజాగా కీలక నేతకు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *