Cricket: ఇంగ్లాండ్పై బర్మింగ్హామ్ వేదికగా టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టుల సిరీస్లో రెండో మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇది గిల్ కెప్టెన్సీలో భారత్కు వచ్చిన తొలి విజయంగా నిలిచింది. ఈ విజయంతో 58 ఏళ్ల తర్వాత బర్మింగ్హామ్లో భారత్ ఓ ఘనతను సాధించింది.
భారత్ మొదటి ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రదర్శనతో 587 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్లో మరోసారి బలంగా ఆడి 427/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్కి 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, వారు రెండో ఇన్నింగ్స్లో 271 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
ఈ మ్యాచ్లో పేసర్ ఆకాష్ దీప్ దుమ్మురేపాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో భారత్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
ఇందుతో సిరీస్ 1-1తో సమమైనట్టు భారత్ తిరిగి పోటీకి వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిగతా మూడు టెస్టులకు ముందుగా భారత్కు మోరల్ బూస్ట్ లభించినట్టు స్పష్టమవుతోంది.