Cm ramesh: తెలంగాణ రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ పొత్తు వస్తే బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. అందుకే కేటీఆర్ తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
“బీజేపీ, టీడీపీ కలిస్తే తెలంగాణలో కొత్త రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. దీనికే భయపడి బీఆర్ఎస్ నేతలు గోల చేస్తున్నారు. కేటీఆర్ మాట్లాడే భాష, ప్రవర్తన నీ స్థాయిని ప్రతిబింబిస్తున్నాయి. విమర్శలు చేయడంలో పరిమితి ఉండాలి,” అని సీఎం రమేష్ హెచ్చరించారు.
కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, తెలంగాణ ప్రభుత్వం తీసుకునే లోన్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసినందుకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇటీవల బీజేపీ-టీడీపీ పొత్తుపై బీఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శలు చేయడాన్ని సీఎం రమేష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను రేపు మరింత ఉత్కంఠతకు గురిచేసేలా ఉన్నాయి.
