Chhattisgarh: క్షణ క్షణం హై టెన్షన్.. కొనసాగుతున్న ఎన్ కౌంటర్

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గురువారం భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మూడు విభాగాల భద్రతా సిబ్బందితో కూడిన జాయింట్ టీమ్ యాంటీ-నక్సలైట్ ఆపరేషన్‌ను నిర్వహిస్తుండగా, గురువారం ఉదయం ఈ ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), కోబ్రా బలగాలు పాల్గొన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా, తదుపరి సమాచారం కోసం వేచి చూస్తున్నామని అన్నారు.

చివరి కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్లలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతుండగా, ప్రతీకార చర్యలలో భాగంగా వారు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఐఈడీతో పేల్చారు. ఈ దాడిలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి నక్సల్స్‌ రహిత దేశాన్ని ఆవిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేసిందని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు యాంటీ-నక్సలైట్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Indian Railways: మ‌హా కుంభ‌మేళాకు 13 వేల‌ రైళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *