Chandrababu: దావోస్ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పర్యటన సందర్భంగా జరిగిన అంశాలు, పెట్టుబడుల వివరాలు, తదితర అంశాలపై వివరాలు తెలియజేశారు.
దావోస్ పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలపై వ్యాఖ్యలు
చంద్రబాబు మాట్లాడుతూ, “దావోస్ గురించి ప్రజల్లో ఒక భ్రమ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు? ఎంత డబ్బులు వచ్చాయి? అని ప్రశ్నిస్తారు. అయితే ఇది ఒక తప్పుదారుణం. ఇక్కడ ఎంవోయూలు అక్కడ (దావోస్లో) చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ అనేది ఒక నెట్వర్కింగ్ కోసం ఉన్న ప్రదేశం” అని స్పష్టం చేశారు.
తన పర్యటన ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించడంలో దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.