Bengaluru:కన్నడ హీరో దర్శన్ కు బెయిల్..

Bengaluru: రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దర్శన్‌తో పాటు నటి పవిత్ర గౌడ సహా ఆరుగురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడతో పాటు 16 మందిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాలతో వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

అయితే, వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్ ఇంతకు ముందు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆరు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో దర్శన్ జైలు నుంచి బయటకు వచ్చారు. తాజాగా రెగ్యలర్ బెయిల్ మంజూరు అయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Indian criminals: మనదేశంలో నేరాలు.. అరబ్ దేశాల్లో జల్సాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *