Amaravati

AP News: అమరావతి స్పెల్లింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ‘Thi’ కాదు.. ‘Ti’ మాత్రమే!

AP News: ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ పేరు స్పెల్లింగ్ విషయంలో ఇకపై ఎలాంటి గందరగోళం ఉండకూడదని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ రికార్డుల్లో లేదా ఇతర పత్రాల్లో కొందరు ‘Amaravathi’ అని, మరికొందరు ‘Amaravati’ అని రాస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రభుత్వం, ఇక నుంచి అన్ని అధికారిక పత్రాల్లోనూ చివరన ‘Thi’ కాకుండా ‘Ti’ మాత్రమే ఉండాలని, అంటే ‘Amaravati’ అని మాత్రమే వాడాలని తేల్చి చెప్పింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, ప్రభుత్వ శాఖలకు మరియు స్థానిక సంస్థలకు ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు, నోట్ ఫైళ్లు మరియు అధికారిక డాక్యుమెంట్లలో ఒకే రకమైన స్పెల్లింగ్ కనిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ప్రభుత్వ రికార్డులలో ఏకరూపత ఉంటుందని, స్పెల్లింగ్ తేడాల వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.

కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రకటనలు, లెటర్ హెడ్‌లు మరియు అన్ని రకాల డిజిటల్ రికార్డుల్లో కూడా వెంటనే మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. రాజధాని పేరు విషయంలో ఉన్న చిన్నపాటి కన్ఫ్యూజన్‌కు చెక్ పెడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇకపై అన్ని చోట్లా అమరావతి పేరు ఒకేలా దర్శనమివ్వనుంది. దీనిని కింది స్థాయి అధికారులు సైతం ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *