AP 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు (AP SSC Results 2025) ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆయనతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసారి 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.
ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు అధికారిక వెబ్సైట్లైన https://bse.ap.gov.in/ లేదా https://results.bse.ap.gov.in/ సందర్శించవచ్చు. అదనంగా వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది.
పొరపాట్లు ఉంటే ఏమి చేయాలి?
ఫలితాలు చూసిన తర్వాత పేరు, మార్కులు, వ్యక్తిగత వివరాల్లో ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే మీ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్లు విద్యా మరియు ఉద్యోగ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఏదైనా తప్పిదం ఉంటే దానిని సరిచేయకపోతే భవిష్యత్లో సమస్యలు ఎదురవుతాయనేది నిపుణుల సూచన.