Adilabad

Crime News: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

Crime News: స్టాక్ మార్కెట్ లో నష్టాలు, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లతో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు ఓ కుటుంబాన్ని నిండా ముంచాయి. ఆశించిన లాభాలు రాకపోవడం, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లు ఎక్కువవడంతో కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేయగా.. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Crime News: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. బాధితులంతా ఇప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధిత కుటుంబ సభ్యులు ప్రాథమికంగా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాసీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య కిరాణా షాప్ నడిపిస్తుండేవాడు. ఆయనకు భార్య శ్రీదేవి, కొడుకు శివ ప్రసాద్, కూతురు చైతన్య ఉన్నారు. కాగా కొద్దిరోజులుగా శివ ప్రసాద్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. ఇందుకు తెలిసిన వారి దగ్గర పెద్ద మొత్తంలోనే అప్పులు చేశాడు.

Crime News: కానీ లాభాలు ఆశించినంతగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. స్నేహితులు, సన్నిహితుల నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు వివిధ లోన్ యాప్ ల నుంచి కూడా వీలైనంత అప్పులు చేశారు. అయినా సమస్య తీరకపోవడం, అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, లోన్ యాప్ ల అప్పులతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబం సూసైడ్ చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు మొండయ్య, సముద్రాల శ్రీదేవి,కూతురు చైతన్య,కుమారుడు శివ ప్రసాద్ అంతా కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అనంతరం సముద్రాల మొండయ్య గడ్డి మందు తాగిన విషయాన్ని తన బావమరిది రమేష్ కు ఫోన్ చేసి చెప్పాడు.

Crime News: దీంతో వాళ్లు హుటాహుటిన మొండయ్య ఇంటికి చేరుకోగా.. వాళ్లంతా గడ్డి మందు తాగి కనిపించారు. అనంతరం వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వారి పరిస్థితి మెరుగు పడకపోవడంతో నలుగురినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ALSO READ  Pawan Kalyan: నేను మాట ఇచ్చానంటే వెనక్కి తగ్గను

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *