Crime News

Crime News: మరో ఘోరం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

Crime News: తెలంగాణలో మరో ఘోరం చోటు చేసుకుంది. సీఎంఆర్ కాలేజ్ ఘటన మరువకముందే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి జీవితానికి రక్షణ లేకుండా పోయింది. ఓ కామాంధుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం శివారులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరోసారి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై కాలేజ్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున హాస్టల్‌లోకి వెళ్లి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.

తెల్లవారుజామున కావడంతో విద్యార్థినులందరూ నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలో కామాంధుడు ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనపై విద్యార్థిని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bhopal Drugs Factory: అమ్మో.. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికాయి.. ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేశారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *