Bandi Sanjay

Bandi Sanjay: మార్చిలోపు మావోయిజం అంతం.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక ప్రకటన

Bandi Sanjay: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ కుమార్ మావోయిజంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట అంటే అది తప్పక జరిగే మాటేనని, వచ్చే మార్చి నెలలోపు దేశంలో మావోయిజం పూర్తిగా అంతమవుతుందని ఆయన గట్టిగా ప్రకటించారు. నక్సలైట్ల సమస్యపై కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నక్సలైట్ల చావులకు అర్బన్ నక్సల్సే కారణం!
మావోయిజం వెనుక ఉన్న అసలు కుట్రను బండి సంజయ్ ఎత్తిచూపారు. నక్సలైట్లు అమాయకంగా అడవుల్లో తుపాకులు పట్టుకుని పోరాడుతూ ప్రాణాలు కోల్పోతుంటే, వారిని రెచ్చగొట్టిన “అర్బన్ నక్సల్స్” మాత్రం నగరాల్లో హాయిగా పెద్ద పెద్ద పదవులు, జీవితాలను అనుభవిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ అర్బన్ నక్సల్సే అసలైన నేరస్థులని, అమాయక నక్సలైట్ల చావులకు వీరే కారణమని బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శించారు.

కుటుంబాల గుండె కోత మీకు తెలియదా?
నక్సల్స్ పేరుతో జరుగుతున్న హింస వల్ల వారి కుటుంబాలు పడుతున్న బాధను బండి సంజయ్ గుర్తుచేశారు. “ఒక నక్సలైట్ చనిపోతే, ఆ తల్లిదండ్రుల గుండెకోత, ఆ కుటుంబసభ్యుల కష్టం మీకు ఏం తెలుసు?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం తుపాకీని పట్టుకున్న నక్సలైట్లు మాత్రమే కాదు, వారి పోరాటాన్ని, హింసను సమర్థించే ప్రతి ఒక్కరూ కూడా నేరస్థులే అవుతారని ఆయన హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత విషయంలో వెనకడుగు వేసేది లేదని, మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా లేకుండా చేస్తామని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *