Women’s World Cup: భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త చరిత్రను లిఖించింది. సెమీ-ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన హర్మన్ప్రీత్ కౌర్ (హర్మన్ సేన) సారథ్యంలోని భారత జట్టు… ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవంబర్ 2న జరగనున్న తుది పోరులో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా (SA)తో టైటిల్ కోసం తలపడనుంది. హర్మన్ సేన ఫైనల్కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
క్రీడాభిమానులంతా భారత్ కప్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.1973 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతుండగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం మూడు జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే ఈ కప్పును ముద్దాడాయి. 1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుచుకున్నాయి.
ఇది కూడా చదవండి: PG Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ ఈవెంట్ నవంబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్విహించబోతున్నాము…
ఈ నేపథ్యంలో, హర్మన్ సేన ఈసారి ప్రపంచకప్ను గెలిస్తే, విజేతల జాబితాలో చేరిన నాలుగో జట్టుగా, ఆసియా నుంచి తొలి జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించనుంది. నవంబర్ 2న SAతో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి, కప్పును గెలిచి, ఈ రికార్డును తిరగరాస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.


