Hyderabad: కవిత ఫ్లెక్సీలు చంపేస్తున్న బీఆర్ఎస్ నేతలు

Hyderabad: బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కవిత పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు బీఆర్ఎస్ స్థానిక నాయకులే చింపేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

కవితపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఆమె పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో పాటు, కీలక నేతలపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల కారణంగా కవితకు పార్టీ ఆధారిత వర్గాల్లో మద్దతు తగ్గిపోతోంది. ఇది సస్పెన్షన్ వరకు దారి తీసింది.

ఫ్లెక్సీలు చింపివేయడం ద్వారా కవితకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు తమ ఆగ్రహాన్ని బహిర్గతం చేస్తున్నారు. అయితే, పార్టీ నాయకత్వం ఈ పరిణామాలపై మౌనం పాటిస్తోంది. కవిత భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో చూడాల్సి ఉంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *