Delhi

Delhi: ఢిల్లీలో పట్టపగలు కాల్పుల కలకలం

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం కాల్పుల ఘటన వెలుగు చూసింది. అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధ్‌పూర్‌లో, మోటారుసైకిల్‌పై వెళ్తున్న దుండగులు ప్రాపర్టీ డీలర్‌ దుకాణంపై అనేక రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. అదే సమయంలో, ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో మరో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ కాల్పుల ఘటన ఔటర్-నార్త్ ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు దుండగులు ప్రాపర్టీ డీలర్‌ కార్యాలయంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే,  కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. బుద్‌పూర్‌లోని గ్యాస్ ఏజెన్సీ సమీపంలో కాల్పుల ఘటనపై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

Delhi: మధ్యాహ్నం 3 గంటలకు అలీపూర్ ప్రాంతంలో కాల్పుల ఘటనపై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. విచారణలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. వారు ప్రాపర్టీ డీలర్ కార్యాలయంలోకి ప్రవేశించి, అనేక రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. విచారణ కొనసాగుతోందని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Satellite Internet: శాటిలైట్ ఇంటర్నెట్ తో ప్రపంచాన్ని మార్చనున్న మోడీ.. ఎప్పటి నుంచి అంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *