Mumbai: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. తాజాగా కృష్ణ జింకను చంపినందుకు గానూ సల్మాన్ ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెప్పాలని లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేశారు.సోమవారం ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్కు ఈ సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదా రూ. 5 కోట్లు చెల్లించాలి. అలా చేయకపోతే మేము అతన్ని చంపేస్తాం. మా గ్యాంగ్ యాక్టివ్గా ఉంది’ అని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
వరుస బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్కు భద్రతను పెంచింది. కాగా, సల్మాన్ ఖాన్కు ఇటీవలే వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 17 రాత్రి ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు మెసేజ్ చేశారు. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు.
ఆ తర్వాత అక్టోబరు 30వ తేదీన కూడా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. రూ. రెండు కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని ఆయన్ను బెదిరించారు. ముంబైలోని వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.