Delhi: అమెరికా నుంచి ఆయుధాలు కొనం.. ట్రంప్ కు దీటైన కౌంటర్

Delhi: కేంద్ర కేబినెట్‌ ఈ రోజు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా విధించిన 50% సుంకాలపై చర్చించడంతో పాటు, దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఐదు ప్రధాన అంశాలపై ఆమోదం తెలిపింది.

ప్రధాన నిర్ణయాలు:

పీఎం ఉజ్వల యోజనను కొనసాగించాలని నిర్ణయం.

అసోం, త్రిపుర రాష్ట్రాలకు రూ.7,250 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ; ఇందులో రూ.4,250 కోట్లు గ్రాంట్‌గా.

సాంకేతిక విద్య కోసం రూ.4,200 కోట్లు కేటాయింపు – ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల అప్‌గ్రేడ్‌కు ఉపయోగం.

మరక్కనం-పుదుచ్చేరి 4-లేన్ హైవే నిర్మాణానికి ఆమోదం; రూ.2,157 కోట్లు కేటాయింపు.

ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారంగా రూ.30,000 కోట్లు మంజూరు.

అమెరికా సుంకాలకు ప్రతిస్పందన:

అమెరికా 50% సుంకాలకు ప్రతిగా, భారత్‌ కీలక చర్యలు చేపట్టింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు, ముఖ్యంగా క్షిపణుల డీల్‌ను నిలిపివేసింది. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *