Vijay Devarakonda: బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట బుధవారం (ఆగస్టు 6) బాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు పలు రకాల ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఆయన స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేసుకున్నారు.
Vijay Devarakonda: ఇప్పటికే ఈ కేసుల విచారణకు సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయన నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇంకా దగ్గుపాటి రానా, మంచు లక్ష్మి తదితరులను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఆగస్టు 11న రానా, 13న లక్ష్మి విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.
Vijay Devarakonda: చట్టవిరుద్ధమైన ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్పై గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. పలువురు నటులు, ఎందరో ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్లపై ప్రచారం చేయడంతో ఎందరో ప్రజలు వాటి వ్యామోహానికి లోనయ్యారని, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని, మరెందరో సర్వం కోల్పోయారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విచారణ ఎటువైపు దారితీస్తున్నదో వేచి చూడాలి మరి.