Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (జూలై 19) తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఈ వారం తిరుపతి జిల్లాలోని కపిలతీర్థం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి ప్రజావేదిక వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
Chandrababu Naidu: ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్తారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూకివాకం గ్రామం వెళ్తారు. అక్కడ తిరుపతి కార్పొరేషన్కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుపతి కపిలతీర్థం చేరుకుని అక్కడి కపిలేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
Chandrababu Naidu: కపిలతీర్థంలోనే జరిగే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.45 గంటల దాకా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠం మఠానికి చేరుకుంటారు. అక్కడే కంచి స్వాములతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం విజయవాడకు తిరుగు పయనం అవుతారు.