Maoist: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో మావోయిస్టుల లొంగింపు సంచలనంగా మారింది. మొత్తం 22 మంది మావోయిస్టులు నారాయణపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో పలువురిపై ప్రభుత్వం భారీగా నజరబెట్టినట్లు సమాచారం. లొంగిపోయినవారిపై కలిపి రూ.37 లక్షల రివార్డ్లు విధించబడి ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
వీరిలో పలు నక్సలైట్ గుంపులకు కీలకంగా పని చేసిన మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. లొంగిపోయినవారు ప్రభుత్వ పునరావాస పాలసీతో ప్రేరితమై సామాజిక జీవనానికి మళ్లుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.ఈ చర్యతో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు.
