కేరళలో జీఎస్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ దాడుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు.మొత్తం 35 మంది బంగారం వ్యాపారుల ఇళ్లలో రాష్ట్ర జీఎస్టీ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సోదాలు చేశారు. ఈ దాడుల్లో లెక్క తేలని 105 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.గోవర్ ఆఫ్ గోల్డ్ పేరుతో త్రీసూర్ లో గోల్డ్ ఇండస్ట్రీలోని గోడైన్లు, తయారీ కేంద్రాలు, దుకాణాలు, ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు.
చాలా మంది గోల్డ్ వ్యాపారులు పన్ను చెల్లించకుండానే బంగారం లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలిందని అధికారులు గుర్తించారు.భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయన్నారు.జీఎస్టీ స్పెషల్ కమిషనర్ అబ్రహాం రెన్ ఎస్ నేతృత్వంలో ఈ దాడులు ఇవాళ సాయంత్రానికి ముగియనున్నాయి

