Hyderabad: పహల్గామ్ దాడి తర్వాత కేంద్రం కఠిన నిర్ణయాలు – హైదరాబాద్‌లో పాక్ యువకుడు అరెస్ట్

Hyderabad: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు స్పందనగా, పాకిస్తాన్ పౌరులపై భారత ప్రభుత్వం కఠిన వైఖరి అనుసరిస్తోంది. ఈ దాడి అనంతరం పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసిన కేంద్రం, తక్షణమే దేశం విడిచి వెళ్లాలన్న ఆదేశాలను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సోదాల్లో పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

అధికారుల ప్రకారం, అరెస్టయిన వ్యక్తిని మహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు. ఆయన గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడిగా గుర్తించబడినట్లు సమాచారం. ఇటీవలే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. తన భార్యను కలుసుకునేందుకే నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రస్తుతం ఫయాజ్‌ను అదుపులో ఉంచిన పోలీసులు, అతని ప్రయాణ వివరాలు, అనుమానాస్పద సంబంధాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత అతడిని పాకిస్తాన్‌కు తిరిగి పంపనున్నట్లు నగర పోలీసు అధికారులు తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *