Ramayana: రన్బీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రామాయణ”. ఇది వరకు మన ఇండియన్ సినిమా నుంచి రామాయణ గాథపై చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Court Collection Day 1: డే 1 సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న “కోర్ట్”!
ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది దీపావళికి అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారింది. పార్ట్ 1 షూటింగ్ ప్రస్తుతానికి పూర్తయ్యినట్టుగా తెలుస్తుంది.అలాగే పార్ట్ 2 కూడా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది నవంబర్ నాటికి కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.