Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నారు.
అలాగే వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది ప్రభుత్వం. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ రెండు నియామకాలతో పాటు రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఇంఛార్జి వీసీలను ప్రభుత్వం మార్చింది. బాసర ఐఐఐటి, కోఠి మహిళా యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను నియమించారు.
బాసర ఐఐఐటి ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ను, కోఠి మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధనావత్ సూర్యను నియమించారు.