Delhi: ఆప్ ఓటమిపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు..

Delhi: 2025 ఫిబ్రవరి 8న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఊహించని విధంగా ఘోర ఓటమి చెందింది. బీజేపీ విజృంభన ముందు ఆప్ నిలువలేకపోయింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 50 చోట్ల గెలిచిన బీజేపీ, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆప్ ముఖ్యనేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా ఓటమిని మూటగట్టుకున్నారు. వీరి పరాజయం ఆప్ కార్యకర్తల్లో తీవ్ర నిరాశను కలిగించింది.

ఢిల్లీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చామని గర్వపడిన ఆమ్ ఆద్మీ పార్టీ, తాము ఊహించని విధంగా ఓటమి పాలవ్వడంతో రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేజ్రీవాల్ తనను ఓడించే వారే లేరని గతంలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇక, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన ఓటమికి కారణాలు అనేకంగా ఉన్నప్పటికీ, కొందరు నెటిజన్లు ఈ పరాజయానికి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే శాపమే కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు అన్నా హజారే అండతో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్, చివరకు అదే అవినీతిలో చిక్కుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ, ఆ కేసు ప్రభావం ఈ ఎన్నికలపై తీవ్రంగా పడింది. పార్టీ ముఖ్యనేతలు జైలుపాలవ్వడం, పాలనపై అవినీతి ఆరోపణలు, కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కూడా ఆరోపణలకు గురికావడం – ఇవన్నీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయానికి దారి తీసిన ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో ఒకప్పుడు భారీ మెజారిటీతో గెలిచిన ఆప్, ఈసారి ప్రజల మద్దతు కోల్పోవడం, బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో అధికారం కోల్పోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగామారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *