Serilingampally: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలు చందానగర్ పిజేఆర్ స్టేడియం లో ఘనంగా నిర్వహించారు.
ఈ బతుకమ్మ సంబరాలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వేలాది మంది మహిళలు బతుకమ్మ సంబరాల ఆటపాటలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, సినీ ఆర్టిస్ట్ రజిత,నియోజకవర్గ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.