Gold rate: మళ్ళీ షాకిస్తున్న బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి !

Gold rate: పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హెచ్చుతగ్గులతో పసిడి ప్రియులను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. ఒకరోజు ధర పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తులం బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.79,990వద్ద ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో తులం రూ. 72,600కు చేరుకుంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 79,700వద్ద ట్రడేవుతోంది. దేశ రాధాని ఢిల్లీలోనైూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 650 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 79 వేల 855గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 79 వేల 900గా ఉంది.

ఇక వెండి ధ‌ర‌లు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర 1,02,220 గా నమోదు అయింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *