allu arjun

Allu Arjun: ఆ కుటుంబం బాధ్యత నాదే..

Allu Arjun: ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. మేం ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తెలిసింది. రేవతి అనే మహిళ మృతి చెందిందనీ, ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలియగానే షాక్‌కు గురయ్యాను. థియేటర్‌కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటం 20ఏళ్లుగా నాకు అలవాటు.

ఇది కూడా చదవండి: Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమా ఎందుకు మొదలు కాలేదు!?

Allu Arjun: ఆ ఆనవాయితీ ప్రకారం వెళ్లాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం అనుకోలేదు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేం ఎంత చేసినా ఆ కుటుంబానికి ఎదురైన లోటుని పూడ్చలేం. నా వంతు పరిహారంగా 25లక్షలు వారి కుటుంబానికి అందజేస్తున్నాను. అంతేకాక ఆమె కుమారుడి మెడికల్‌ ఖర్చులు కూడా భరిస్తానని తెలియజేస్తున్నాను. ఇక ఆ కుటుంబం బాధ్యత నాదే’ అని అల్లు అర్జున్ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *