NIA Special Court: ఉద్యోగాలు, ఇంకా మంచి జీతాల ఇపిస్తాం అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా భారత్కు రప్పించి, వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులో హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం (NIA Special Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితులుగా ఉన్న 9 మందికి జీవిత ఖైదు (యావజ్జీవ కారాగార శిక్ష) విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషులుగా తేలిన 9 మందిలో 8 మంది బంగ్లాదేశ్ పౌరులే కావడం గమనార్హం. అదనంగా నిందితులందరికీ కలిపి మొత్తం రూ.1.37 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అసలేం జరిగింది? 2019 నాటి కేసు నేపథ్యం..
-
రూహుల్ అమీన్ ధాలీ
-
మహమ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ మహమ్మద్ ఇమ్రాన్
-
బీథీ బేగం అలియాస్ ఖదీజా షేక్
-
ఇమాముల్ గాజీ అలియాస్ మహమ్మద్ రాణా హుస్సేన్
-
మహమ్మద్ అల్ మామూన్
-
సోజిబ్ షేక్
-
సురేష్ కుమార్ దాస్ అలియాస్ సాగర్
-
మహమ్మద్ అబ్దుల్లా మున్షీ అలియాస్ అబ్దుల్ సర్కార్
-
మహమ్మద్ అయూబ్ షేక్
నిందితులపై మోపిన తీవ్రమైన అభియోగాలు రుజువు కావడంతో, దోషులుగా తేల్చుతూ హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు సెప్టెంబర్ 17న చారిత్రక తీర్పును వెలువరించింది.
