Jogulamba gadwala: మందుకు పైసలు ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు

Jogulamba gadwala: మద్యానికి బానిసలై యువకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. రోజు లిక్కర్ చుక్కలేనిది వాడి బాడీ కదల్ లేనంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వమని రోజు కన్నవారిని వేధింపులకు గురి చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని కలవరానికి గురి చేస్తుంది. లిక్కర్  కోసం డబ్బులు ఇవ్వలేదని ఉప్పరి చిన్న కృష్ణయ్యను కొడుకు యుగంధర్  హత్య చేశాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కరెడ్డిపల్లెకు చెందిన తండ్రి వడ్డే చిన్న కృష్ణయ్య, కొడుకు యుగంధర్  తాగి గొడవ పడుతుండేవారు.  ఆదివారం తండ్రిని లిక్కర్  కోసం డబ్బులు అడిగాడు. లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తండ్రిని ఇంటిలోకి తీసుకెళ్లి ఇంట్లో డెక్(టేప్  రికార్డర్) ఆన్  చేసి కత్తిపీటతో నెత్తిపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్ఐ సంతోష్  ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *