ఆవును కాపాడబోయి.. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జలపైగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల మిథున్ పొలం నుంచి ఆవును ఇంటికి తీసుకెళ్తున్నాడు. షెడ్డు బయట నిలిచిన నీటిలో పడి ఉన్న కరెంట్ వైరు ఆవుకు తగిలింది. ఈ క్రమంలో దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు.
అతడికి షాక్ తగలడంతో తండ్రి పరేష్ (60), దీపాలి తల్లి (55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఇలా ఆ ముగ్గురూ షాక్తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు రెండేళ్ల సుమన్ సైతం ప్రాణాలు వదిలాడు. ఆ సమయంలో ఇంట్లో లేని వారి కోడలు ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నది. వర్షం కారణంగా ఇరుగుపొరుగు వారికి ఈ విషయం తెలియదు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో మిథున్ భార్య ఇంట్లో లేదని పోలీసులు వెల్లడించారు.