KTR: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం (జనవరి 27న) కలువునున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆయనను కలువాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి కుంభకోణంపై గవర్నర్కు వివరాలు అందజేయనున్నది.
KTR: సింగరేణి కుంభకోణంలో సీఎం రవేంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనున్నారు. కుంభకోణాల్లో వారి పాత్రపై సాక్షాధారాలతో కూడిన నివేదికను ఇవ్వనున్నది. ఇప్పటికే కేటీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్రావు పలు అంశాలను లేవనెత్తారు. ఇప్పటికే సింగరేణిపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు.
