YS Jagan

YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌కు అస్వస్థత.. పులివెందుల పర్యటన రద్దు

YS Jagan: జ్వరంతో బాధపడుతున్న జగన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఆయన శరీరం బాగా నీరసించిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని, కనీసం రెండు మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆయన తన రాజకీయ కార్యక్రమాలన్నింటినీ తాత్కాలికంగా పక్కన పెట్టారు.

క్రిస్మస్ వేడుకలకు దూరం రేపు క్రిస్మస్ పండుగ కావడంతో, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇవాళ అక్కడ జరగాల్సిన వేడుకల్లో ఆయన స్వయంగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. దీంతో స్థానిక నేతలు, కార్యకర్తలు కొంత నిరాశకు గురయ్యారు.

అభిమానుల ఆందోళన జగన్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ‘గెట్ వెల్ సూన్’ సందేశాలు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *