Hyderabad

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాముల కలకలం

Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విషపూరితమైన పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో భద్రతా సిబ్బంది తనిఖీ చేయడంతో వారి వద్ద విషపూరితమైన పాములు బయటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మహిళలు ఎవరు? విషపూరిత పాములను ఎందుకు తరలిస్తున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తరచూ బంగారంతో సహా ఏవో ఒకటి పట్టు పడుతూనే ఉంటాయి. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల బంగారాన్ని, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. తాజాగా విషపూరిత పాములను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబుల కలకలం సృష్టించాయి. నిరంతరం పటిష్ట బందోబస్తుతో ఉండే ఎయిర్‌పోర్టులో ఈ వరస ఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Hyderabad: బ్యాంకాక్ నుండి వచ్చిన ఇద్దరు మహిళలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారి వద్ద అనుమానాస్పదంగా బ్యాగులు కనిపించాయి. దీంతో తనిఖీ చేయగా, రెండు అత్యంత అరుదైన విషపూరిత పాములు దర్శనమిచ్చాయి. ఆ పాములను చూసిన కస్టమ్స్ అధికారుల సైతం ఖంగుగుతిన్నారు. వివిధ రూపాల్లో బంగారం, డ్రగ్స్ తరలిస్తున్న నిందితులను చూసిన కస్టమ్స్ అధికారులు, చెకింగ్ లో భాగంగా పాములను చూసి షాక్ అయ్యారు. బ్యాగులలో, లో దుస్తులలో నొప్పి చప్పుడు కాకుండా పాములను కూడా తీసుకురావడంతో ఎయిర్‌పోర్టు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Uttar Pradesh: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *