Pakistan: భారీ పేలుడు..ఐదుగురు ఉగ్రవాదులు హతం..

Pakistan: పాకిస్తాన్ లో భారీ పేలుడు జరిగింది.ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్‌లోని కల్లోల ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంక్వాలో గురువారం జరిగిన కారు బాంబు పేలుడులో ఏడుగురు మరణించారు. పేలుడు కారణంగా 14 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగిన కారు పాకిస్తాన్ తాలిబాన్ సభ్యునికి చెందినది. ఉగ్రవాదిని పాకిస్థాన్ తాలిబన్ కమాండర్ రసూల్ జాన్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

అతను తన ఇంటి వద్ద కారులో బాంబు పెట్టాడు, అది పేలింది, రసూల్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఘటన జరిగిన వెంటనే పాకిస్థాన్ తాలిబన్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల మృతదేహాలను తమ వెంట తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు పేలుడు ధాటికి చితికిపోయిన చిన్నారుల మృతదేహాలను గుర్తించారు.

ఈ ఘటన జరిగిన ప్రాంతం పాకిస్థాన్ తాలిబాన్లకు కంచుకోటగా ఉండడంతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఇక్కడ చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై ఆర్మీ చర్య కొనసాగుతోంది. తాజా ఆపరేషన్‌లో 12 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం తెలిపింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో ఈ ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. బుధవారం, ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని మిరాన్‌షా జిల్లాలో ఉగ్రవాదులపై జరిగిన ఆపరేషన్‌లో ఆర్మీ ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *