Telangana Politics:

Telangana Politics: బీజేపీలోకి వెళ్లే ఆ ఐదుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవ‌రు?

Telangana Politics: రాష్ట్రంలో మూడు పార్టీల వ్యూహ, ప్ర‌తివ్యూహాల‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్న‌ది. అసెంబ్లీ ఎన్నిక‌లు ఇంకా మూడేండ్లు ఉన్న‌ప్ప‌టికీ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ ద‌శ‌లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ రోజే (ఆగ‌స్టు 10) ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బీజేపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.

Telangana Politics: ఇదే ద‌శ‌లో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది. బీఆర్ఎస్ నుంచి ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని పిడుగులాంటి వార్త‌ను పేల్చారు. దీంతో అటు బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేపగా, బీజేపీ, కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌కు దారితీసింది.

Telangana Politics: బీఆర్ఎస్ పార్టీలో ఆ ఎమ్మెల్యేలు ఇమ‌డ‌లేక పోతున్నార‌ని, ఈ కార‌ణంగానే వారు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు ప్ర‌క‌టించారు. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని, మున్ముందు బీఆర్ఎస్ నుంచి మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌ని కూడా ఆయ‌న పిడుగులాంటి వార్త‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

Telangana Politics: ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌ధానంగా హైద‌రాబాద్ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు అయి ఉంటారా? ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేలు అయి ఉంటారా? అన్న విష‌యాల్లో ఇంకా స్ప‌ష్ట‌త రావ‌డం లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజంగానే బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు చేరుతున్నారా? లేకుంటే వ్యూహాత్మ‌కంగా రామ‌చందర్‌రావు ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారా? అన్న‌ది కూడా తేలాల్సి ఉన్న‌ది.

Telangana Politics: బీఆర్ఎస్‌లో కేసుల గోల‌, క‌విత వ్య‌వ‌హారం, కాళేశ్వ‌రం కుంప‌టి నుంచి బీఆర్ఎస్ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ద‌శ‌లో స‌రైన రీతిలోనే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నా.. భ‌విష్య‌త్తులో ఇటు అధికార కాంగ్రెస్ నుంచి, అటు కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేత‌ల‌కు ముప్పు త‌ప్ప‌ద‌నే భావ‌న‌తో చాలా మంది నేత‌లు భావిస్తున్నార‌ని తెలుస్తున్న‌ది.

Telangana Politics: ఈ ద‌శ‌లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్నార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రామ‌చందర్‌రావు ప్ర‌క‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది. దీంతో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవ‌రై ఉంటార‌న్న విష‌యంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. వారి చేరిక కూడా ఆగ‌స్టులోనే ఉంటుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. బీఆర్ఎస్ పార్టీలోనూ బీజేపీ ప్ర‌క‌ట‌న‌పై గుబులు నెల‌కొని ఉన్న‌ది. దీనిపై త్వ‌ర‌లోనే విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని తెలుస్తున్న‌ది.

ALSO READ  Minister savitha: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సవిత

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *