Seethakka: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ను, ఆయన దివంగత తల్లిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అత్యంత అసభ్యకర పదజాలంతో దూషించారంటూ సభలో ప్రస్తావిస్తూ మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతూనే ఆమె కంటతడి పెట్టుకోగా, చైర్లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అపూర్వ దృశ్యంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పక్షాల ఎమ్మెల్యేలు స్పీకర్కు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
అసలేం జరిగింది?..
తాతా మధుపై చర్యలకు సర్వపక్షాల డిమాండ్..
తమ పార్టీ నేతలను రెచ్చగొట్టి పంపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యావత్ తెలంగాణ సమాజానికి, సభాపతికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
