Vizag News

Vizag News: విశాఖ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన – పోలీసులకు ఫిర్యాదు

Vizag News: ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్లు,జూనియర్ల మధ్య ఘర్షణ విశాఖలోని దువ్వాడ విజ్ఞాన ఇంజనీరంగ్‌ కళాశాలలో గొడవ పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యాలందరు కలిపి డ్యాన్సులు సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు…
EEE థర్డ్ ఇయర్ విద్యార్ధికి తగిలిందని గొడవ క్షమాపణలు చెప్పిన వినకుండా సీనియర్ విద్యార్ధులు గొడవ తన స్నేహితులతో కలిసి ఆ విద్యార్థిని కొట్టిన సీనియర్లు బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయని ఆరోపణలు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన.

ఈ ఏజ్ లో అలా లేకుంటే ఎలా. అరవడాలు..బిల్డ్ అప్ చూపడాలు. మేమె తోపు అని ఫీల్ అవడాలు. ఇవన్ని కామన్. కాని..కామన్ కదా అని కన్నింగ్ వేశాలు వేస్తేనే …కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు జూనియర్లు , వీళ్ళు సీనియర్లు . ఒకవేళ జూనియర్లు తప్పు చేస్తే సీనియర్లు సరే లే జూనియర్లు కదా అని సర్దుకుపోవాలి కాని..అంతు చూస్తాం అని అంటే ఇదిగో ఇలానే లేనిపోని పంచాయితీలు.

ఏపీలో మరో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. దువ్వాడలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్లు జూనియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు మధ్య గొడవ చోటు చేసుకుంది. కాలేజీలో ఏటా జరిగే యువతరం పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యార్థులందరు కలిపి డ్యాన్సులు చేశారు.

ఇది కూడా చదవండి: Myths And Facts on water: అవునా.. నీళ్లు తాగితే బరువు తగ్గుతారా..? నిజమెంత..?

అయితే.. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు.. EEE థర్డ్ ఇయర్ చదువుతున్న సూర్య అనే విద్యార్థికి తగిలింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. కాలు తగిలించిన విద్యార్థి క్షమాపణలు చెప్పిన సీనియర్ విద్యార్థి వినలేదు. అతనిపై కోపం పెంచుకుని మరి తన స్నేహితులతో కలిసి ఆ విద్యార్ధిని సీనియర్లు కలిసి కొట్టారు. దీంతో బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టినందుకు బాధితుడు ఫిర్యాదు పేర్కొన్నారు.

విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు జరిగిన విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞాన కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం వలన తరుచు ఇలాంటి ఘర్షణలు జరుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘర్షణపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.

ALSO READ  Dattatreya Hosabale: మత ఆధారిత రిజర్వేయేషన్లను రాజ్యాంగం ఆమోదించదు: ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *