Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. విజయవాడ భావానీపురం పోలీసులు పిటి వారెంట్పై అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో కర్నూలు జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: America Attack On Hindu Temple: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి..
ఆదోని ట్రీ టౌన్లో నమోదైన కేసు నేపథ్యంలో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారు. పోసాని ప్రస్తుతం కర్నూలు జైలులో ఉండగా, ఆయన బెయిల్ పిటిషన్పై రేపు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ జరగనుంది. కస్టడీ కోసం ఆదోని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై మేజిస్ట్రేట్ తీర్పు రిజర్వులో ఉంచడంతో, పోసాని కేసుపై ఉత్కంఠ కొనసాగుతోంది.