Equestrian League Final: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు శనివారం బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
ఈ ఇద్దరు ప్రముఖ నేతలు చిక్కజాల ప్రాంతంలోని సర్జ్ స్టేబుల్ ఈక్వెస్ట్రియన్ ఫెసిలిటీ కేంద్రంలో నిర్వహించిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ గుర్రపు పందేల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి వైఎస్ జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి ట్రోఫీలను అందజేశారు.

Also Read: iBomma Ravi: ఐ బొమ్మ రవి(iBomma Ravi)కి క్రేజీ చూస్తూ మైండ్ బ్లోయింగ్ బ్రో!
అవార్డుల ప్రధానోత్సవం అనంతరం, ఈ ఇద్దరు మాజీ మంత్రులు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఈ దృశ్యాలు ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానుల మధ్య సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఈ ప్రైవేట్ ఫంక్షన్కు హాజరయ్యారు.
నిర్వాహకుల సమాచారం ప్రకారం, ఈ పోటీల్లో దేశంలోని అగ్రశ్రేణి రైడర్లతో పాటు నలుగురు అంతర్జాతీయ రైడర్లు—ఎడ్వర్డ్ స్కీమిజ్, బొండరివా జైన్, షాడీ సమీర్, వ్యాలంటైన్ మార్కట్—పాల్గొని తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ముఖ్యమైన క్రీడా కార్యక్రమంలో వైఎస్ జగన్, కేటీఆర్ల కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Beta feature
Beta feature
