Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్ ప్రయాణం 10 సంవత్సరాలు పూర్తయింది.

మన్ కీ బాత్’ పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ మనం పరిశుభ్రత కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలను కనుగొంటాము. మరికొద్ది రోజుల్లో అంటే అక్టోబర్ 2వ తేదీకి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. భారతదేశ చరిత్రలో దీన్ని ఇంత గొప్ప ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దిన వారికి అభినందనలు తెలిపే సందర్భం ఇదేనని అన్నారు.

వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘మన్ కీ బాత్’లో ఇది నాలుగో ఎపిసోడ్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *