Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అక్కడి బీజేపీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున జరిగే ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించిన విజయాలతో పాటు కూటమి ఐక్యత, సీట్ల సర్దుబాటు, ప్రజలకు ఇచ్చిన హామీలపై ఆయన అక్కడి సభల్లో చైతన్యం తేనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
