Pawan Kalyan: డయేరియా మరణాలు.. డిప్యూటీ సీఎం పవన్ లక్ష విరాళం..

డయేరియా వ్యాప్తిపై విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమించినట్టు డిప్యూటీ సీఎం అవన్ కళ్యాణ్ చెప్పారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ డయేరియా మరణాలు నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందని అన్నారు.

విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని తెలిపారు.తన తరఫున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ప్రకటిస్తున్నానని వివరించారు. గుర్ల గ్రామానికి వెళ్లే చంపావతి నీరు కలుషితమైందని వెల్లడించారు. గత ప్రభుత్వం కనీసం మంచి నీరు అందించలేకపోయిందని విమర్శించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kethireddy: చెరువు కబ్జా విషయంలో రాజకీయ కోణం ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *