Sathyaraj: మధురైలో జరిగిన మురుగన్ మానాడు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడిన పవన్, నాస్తికులు హిందువులను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని, సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు తమకు ఉందని ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో మతం పేరుతో రాజకీయ ఉద్దేశంతో చేసినవని, రాష్ట్రంలో చిచ్చు రేపే ప్రయత్నమని డీఎంకే నేతలు ఆరోపించారు.
Also Read: Vijay Antony: ఫేమ్ ఉంటే సరిపోదు.. విజయ్ ఆంటోని కీలక వ్యాఖ్యలు
Sathyaraj: ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ పవన్పై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు ప్రజలు పెరియార్ సిద్ధాంతాలను నమ్ముతారని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మురుగన్ సభను ఉపయోగించి తమిళ ప్రజలను మోసం చేయాలనుకుంటే అది పొరపాటేనని, తమిళులు తెలివైనవారని సత్యరాజ్ అన్నారు. పవన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాహుబలి నటుడు సత్యరాజ్ వార్నింగ్
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక
పెరియార్ సిద్ధాంతాలను నమ్మే తమను ఎవరూ మోసం చేయలేరని వ్యాఖ్యలు
తమిళనాట మీ ఆటలు సాగవని.. తీవ్ర విమర్శలు గుప్పించిన సత్యరాజ్#Sathyaraj #PawanKalyan… pic.twitter.com/M3GSNw0Bi0
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 25, 2025