Pavan Kalyan: టాలీవుడ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణలో పొలిటికల్ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ అయిందో అందరం చూసాం. కానీ ఓ ప్రముఖ వ్యక్తి స్పందించలేదని అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఆషామాశి వ్యక్తి కూడా కాదు. అల్లు అర్జున్ కి వరసకు మామ ఏపీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ స్పందనకి ఎంతోమంది వెయిట్ చేశారు. తాజాగా దీనికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు.
అల్లు అర్జున్ అరెస్టు మీ స్పందన ఏంటి అని రిపోర్టర్ అడగగా ఆయన ఈ విధంగా స్పందించారు. “ప్రస్తుతం నేను వచ్చింది సినిమా మీటింగ్ కి కాదు. ఓ వ్యక్తిని హత్య చేయబోయారు ఆ వ్యక్తి తరఫున ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చాను ఏమైనా అడగాలనుకుంటే బియాండ్ దా సినిమా అడగండి. అంటూ ఆ ప్రశ్నను తోసు పుచ్చారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. “వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇది ప్రభుత్వంపై జరిగిన దాడిగా చూస్తున్నాం. అహంకారంతో దాడులు చేస్తే, తోలు తీసి కూర్చోబెడతాం,” అని పవన్ హెచ్చరించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. దాడి ఘటనపై బాధితుడు మరియు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “నేను మీతో ఉన్నాను… ధైర్యంగా ఉండండి,” అంటూ వారికి భరోసా ఇచ్చారు.
వైసీపీపై తీవ్ర విమర్శలు
మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడులు చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని, ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని గుర్తుచేశారు. జవహర్ బాబుపై దాడి చేయడం దారుణమని, దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా అధికారులపై దాడులు చేశాడని అన్నారు.
జవహర్ బాబును చంపుతామని బెదిరించడాన్ని ఖండించిన పవన్, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం అనాగరికమని పేర్కొన్నారు.
పులివెందుల ఘటనపై విచారణ
పులివెందులలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఈ విషయంలో విచారణ జరుగుతోందని పవన్ తెలిపారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.