NASA: ప్రపంచ చంద్రుడిపైకి యాత్రలో మరో అద్భుతం ప్రపంచం ముందు త్వరలో ఆవిష్కృతం కానున్నది. 53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపై మానవుడు కాలు మోపనున్నాడు. ఈ అరుదైన ఘనతను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా సాధించనున్నది. మానవ సహిత మిషన్ అర్టెమిస్-2ను 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 6న ఆ అద్భుతాన్ని సాధించనున్నది.
NASA: ఈ అర్టెమిస్-2 మిషన్లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించనున్నట్టు తెలుస్తున్నది. వీరు 10 రోజులపాటు చంద్రుడి చుట్టూ ప్రయాణిస్తారు. అక్కడి విశేషాలను పరిశోధించి, మనకు అనేక పరిజ్ఞానాన్ని భూమికి అందించనున్నారు. 53 ఏళ్ల తర్వాత చంద్రమండలంపై జరిగిన పరిణామాలను కూడా విశ్లేషించనున్నారు.
NASA: 1969వ సంవత్సరంలో అపోలో-11 ద్వారా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఆర్టెమిస్- 2 ద్వారా మానవజాతి మరోసారి చంద్రుడిని చేరుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ యాత్ర ప్రపంచంలోనే మరో చరిత్రకు శ్రీకారం చుట్టనున్నది. చరిత్ర గతిలో నిలిచిపోనున్నది.
