Crime News

Crime News: వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Crime News: అనంతపురం జిల్లాలో హత్యల పరంపర ఆందోళన కలిగిస్తోంది. రోజుకో హత్య జరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా, మరో వ్యక్తి బండరాయితో  కొట్టి హత్యకు గురయ్యాడు.

తాజా ఘటన

బుధవారం (జూన్ 25) ఉదయం అనంతపురం రూరల్‌లోని అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి మృతదేహం కనపడింది. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాలు ఇలా ఉన్నాయి
సురేష్ కంబదూరు ప్రాంతానికి చెందినవాడు. గత ఆరు సంవత్సరాలుగా అనంతపురం రూరల్‌లోని రాచానపల్లి పరిధిలోని సదాశివ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి సమీపంలో ఓ చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి హోటల్ మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే మరో హత్య కూడా..
మంగళవారం రోజునే అనంతపురం నగర శివారులో బళ్లారి రోడ్డుకు సమీపంలో శివానంద అనే యువకుడు కూడా హత్యకు గురయ్యాడు. ఈ రెండు హత్యలు సమీప ప్రాంతాల్లో, స్వల్ప వ్యవధిలో జరిగిన నేపథ్యంలో ప్రజల్లో భయం మొదలైంది.

పోలీసుల దర్యాప్తు
అనంతపురం రూరల్ పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారంతో నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వరుస హత్యలపై పోలీసులు తీవ్రమైన దృష్టి సారించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  YS Sharmila: నేను ఒక్కదాన్నే వెళ్తా.. చేయి వేస్తే ఊరుకోను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *