Mla varaprasad: కోనసీమలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్కు ONGC నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. బావుల తవ్వకాల్లో జరిగిన లోపాలపై ONGC స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు.
బ్లోఅవుట్ ప్రభావంతో ఖాళీ చేయించిన గుబ్బలపాలెం, ఎంసీ గార్డెన్ ప్రాంతాల ప్రజలు ఇకపై తమ ఇళ్లకు తిరిగి వెళ్లవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ఈ ఘటనలో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వరప్రసాద్ వెల్లడించారు. అలాగే బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వరప్రసాద్ భరోసా ఇచ్చారు.
